హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ గతిని ‘దీక్షా దివస్’ మార్చిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పదకొండు రోజుల సుదీర్ఘ దీక్షతో యావత్తు తెలంగాణ సమాజాన్ని ఏకతాటి మీదకు తీసుకువచ్చిన కేసీఆర్ చేసిన నిరాహార దీక్ష చరిత్రపుటల్లో నిలిచిందన్నారు.
నవంబర్ 29 దీక్షా దీవస్ స్ఫూర్తిని, జ్ఞాపకాలను, పోరాటాలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు.
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షా తెలంగాణ ఏర్పాటు ప్రకటనకు దారితీసిందని పేర్కొన్నారు. తెలంగాణ కోసం చావుదాకా వెళ్లిన కేసీఆర్ త్యాగం మరువరానిదని గుర్తుచేశారు. తెలంగాణ గతిని మార్చిన ఈ దినాన్ని అందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.