హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : డీఈఈసెట్ పరీక్ష జూన్ 1న నిర్వహించనున్నట్టు సెట్ కన్వీనర్ శ్రీనివాసచారి తెలిపారు. ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ డైట్ కాలేజీతోపాటు, ప్రైవేట్ డీఐఈడీ కాలేజీల్లోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
డీఈఈ సెట్కు శనివారం నుంచి మే 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రెండేండ్ల వ్యవధి ఉన్న ఈ కోర్సు ప్రవేశ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. వివరాలకు http ://deecet.cdse.telangana.gov. in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.