న్యూఢిల్లీ, జనవరి 19: పర్యావరణ మార్పుల కారణంగా మనిషి సగటు ఆయుర్దాయం అర్ధ సంవత్సరం(ఆరు నెలలు) పడిపోయే అవకాశం ఉన్నదని తాజా అధ్యయనం వెల్లడించింది. 1940 నుంచి 2020 మధ్య 191 దేశాలకు చెందిన సగటు ఉష్ణోగ్రతలు, వర్షపాతం, ఆయుర్దాయం వంటి వాటిని పరిశోధకులు అధ్యయనంలో భాగంగా పరిగణనలోకి తీసుకొన్నారు. ప్రపంచ ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్ పెరిగితే.. మనిషి సగటు ఆయుష్షు దాదాపు 0.44 సంవత్సరాలు లేదా ఆరు నెలల ఒక వారం హరిస్తున్నదని ఫలితాల్లో వెల్లడైంది.