హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సోనా వరి రకం బియ్యం మార్కెటింగ్పై రాష్ట్ర అగ్రి వర్సిటీతో కొనసాగుతున్న అవగాహన ఒప్పందాన్ని దక్కన్ ముద్రా సంస్థ పునరుద్ధరించుకొన్నది. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వర్సిటీ పరిపాలన భవనంలో శుక్రవారం వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటరమణ, దక్కన్ ముద్ర సంస్థ ప్రతినిధులిరువురు ఒప్పంద పత్రాలను మార్చుకొన్నారు.
కార్యక్రమంలో వర్సిటీ ఉన్నతాధికారులు డాక్టర్ రఘురామిరెడ్డి, డాక్టర్ సుధారాణి, డాక్టర్ సీమ, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ జమునారాణి, డాక్టర్ రవికుమార్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ పద్మజ, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.