హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): శాసనసభ, శాసనమండలి ఉభయ సభల్లో బుధవారం బడ్జెట్పై చర్చ జరుగనున్నది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. నేరుగా బడ్జెట్పై చర్చ ప్రారంభం కానున్నది. బీఆర్ఎస్ నుంచి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, విప్ గువ్వల బాలరాజు మాట్లాడనున్నారు. చర్చ అనంతరం ప్రభుత్వం సమాధానం ఇవ్వనున్నది. శాసనమండలిలో ఉదయం ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు. అనంతరం బడ్జెట్పై చర్చ, ప్రభుత్వం సమాధానం ఉంటాయి.