హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పోలీసు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గడువు సోమవారం ముగియనున్నది. టీఎస్ఎల్పీఆర్బీ.. ఈ నెల 14 నుంచి 26 వరకు అర్హులైన 1,09,906 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తికి ఏర్పాట్లుచేసింది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాలను కేటాయించింది.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కేంద్రంలోనే దరఖాస్తు సవరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది.