Nallagonda | నల్లగొండ : హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే… పీఏపల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో కోళ్లు మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. రిజర్వాయర్లో పెద్ద మొత్తంలో చనిపోయిన కోళ్లను పడేశారని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అసలే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో రిజర్వాయర్లో మృతి చెందిన కోళ్లను పడేయడం ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు శుక్రవారం రిసర్వాయర్ను పరిశీలించారు.
Chicken1
రిజర్వాయర్ను ఇరిగేషన్ అధికారులతో కలిసి దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి పరిశీలించారు. రిజర్వాయర్ వెనక జలాలలో దాదాపు 80 కోళ్లు లభ్యం అయ్యాయి. వీటిని స్థానిక రెవెన్యూ సిబ్బందితో బయటికి తీసి రిజర్వాయర్ మొత్తం పరిశీలిస్తున్నారు. రిజర్వాయర్ కోళ్లను ఎవరు పడేసి ఉంటారో అనే కోణంలో విచారణ చేపడుతున్నామని ఆర్డీఓ చెప్పారు. ఈ ఘటనపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.