హనుమకొండ : హనుమకొండ చౌరస్తాలో ఓ కారులో వ్యక్తి మృతదేహం కలకలం సృష్టించింది. చౌరస్తాలోని స్నేహ బార్ ముందు పార్కింగ్ చేసిన కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కారు డోర్లు తెరిచి చూడగా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
బార్లో మద్యం సేవించి కారు డోర్ వేసుకోవడంతో, ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని పెద్దమ్మగడ్డకు చెందిన రమేశ్గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహం లభించిన కారు నంబర్ – AP 10 AH 7922.