నిర్మల్: జిల్లాలోని భైంసాలోని గడ్డెన్న వాగులో మృతదేహాలు కలకలం రేపాయి. గడ్డెన్న వాగులో యువతి, వివాహితుడి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు.. మృతదేహాలను వెళికితీశారు. మృతుడు భైంసాలోని రాహుల్ నగర్కు చెందిన గోపాల్గా గుర్తించారు. యువతి ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారణ ప్రారంభించారు.