నారాయణపేట : మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో(Muncipal elections) చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అత్త చేతిలో కోడలు ఓడిపోయిన సంఘటన నారాయణపేట మున్సిపాలిటీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఎంపీ డీకే అరుణ 4వ వార్డు కౌన్సిలర్ శ్వేత యాదవ్ (బీజేపీ) కు మద్దతు తెలిపింది. దీంతో మెజారిటీ సభ్యులు కూడా మద్దతు శ్వేత యాదవ్కు సపోర్ట్ చేయడంతో మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు.
అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి (డీకే అరుణ కోడలు) మద్దతు తెలిపిన 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ శ్వేత గౌడ్కు సరిపడా సభ్యుల బలం లేకపోవడంతో ఓటమి పాలయింది. దీంతో అత్త డీకే అరుణ చేతిలో కోడలు పర్ణిక రెడ్డి ఓడినట్లు అయ్యింది.

కాంగ్రెస్ కౌన్సిలర్లు..

బీజేపీ కౌన్సిలర్లు..