జడ్చర్లటౌన్, జనవరి 7: తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు మృతి చెం దింది. ఈ ఘటన ఆదివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది. జడ్చర్ల పట్టణంలోని వెంకటేశ్వరకాలనీలో నివాసముంటున్న దామోదర్(82) గుండెపోటుతో శనివారం రాత్రి మృతి చెందారు. ఆదివారం తండ్రి అంత్యక్రియల సమయంలో సునీత (52) భోరున విలపిస్తూ.. ఒక్కసారిగా కుప్పకూలింది. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను జడ్చర్ల దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.