హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): 2024-25 విద్యాసంవత్సరానికి ఎంసె ట్ (ఈఏపీ సెట్) సహా మరో ఆరు కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షల సెట్స్ కన్వీనర్ల నియామకం కూడా పూర్తయ్యింది. ముందుగా ఈసెట్.. ఆ తర్వాతే ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు, చివరగా ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (పీఈసెట్)ను నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. పరీక్షలను నిర్వహించే యూనివర్సిటీలను కూడా ఖ రారు చేశారు.
పరీక్షల నిర్వహణకు సీఎం రేవం త్ రెడ్డి ఆమోదం తెలిపినట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. ఒకట్రెం డు రోజుల్లోనే తెలంగాణ ఇంజినీరింగ్ ఫార్మసీ, ఎడ్సెట్, ఐసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల షె డ్యూల్ను ఉన్నత విద్యామండలి విడుదల చే యనున్నది. ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి తో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ మేరకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు.