హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): 24 గంటల నిరంతరాయ విద్యుత్తు ఇస్తున్న సీఎం కేసీఆర్ను సవాల్ చేసే నైతికత పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. 24 గంటల పవర్ లేదని చెప్తున్న రేవంత్కి దమ్ముంటే అదే కామారెడ్డిలో ఏదైనా ట్రాన్స్ఫార్మర్లో చేయిపెట్టి 24 గంటలు నిలబడాలని సవాల్ చేశారు. బుధవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంటు లేక ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే 24 గంటల కరెంటు ఇస్తున్న కేసీఆర్ ముందు రేవంత్రెడ్డి కుప్పిగంతులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరాపార్ సాక్షిగా పరిశ్రమల యజమానులు దీక్షలు చేశారని గుర్తుచేశారు.
ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. స్వరాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 18,453 మెగావాట్లకు పెరిగిందని వివరించారు. చంద్రబాబు చెంచాగా, తెలంగాణ ద్రోహిగా పని చేసిన రేవంత్కి అమరవీరుల గురించి మాట్లాడే అర్హత ఉన్నదా? అని ప్రశ్నించారు. అమరావతిలా ఇ కడా 50 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తామనడంతోనే ఆయన నిజస్వరూపం బయటపడిందని చెప్పారు. సొంత పార్టీ టికెట్లు అమ్ముకున్న రేవంత్ని అసెంబ్లీ మెట్టు ఎకనీయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. రేవంత్కి మహిళలను గౌరవించే సంసారం ఉన్నదా? అని నిలదీశారు.