హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): గేయ రచయిత, గాయకుడు మిట్టపల్లి సురేందర్కు ‘మా భూమి దాశరథి ప్రజాసాహిత్య’ పురస్కారం దక్కింది. సోమవారం హైదరాబాద్ ఎల్బీనగర్ వాసవి శ్రీనిలయంలో మా భూమి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ రాధారాణి, సినీనటుడు సుమన్ చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్ జిల్లా అదనపు న్యాయమూర్తి మురళీమోహన్, మా భూమి సమన్వయకర్త నరసింహ ప్రసాద్ గొర్రెపాటి తదితరులు పాల్గొన్నారు.