హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): జవహర్లాల్నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(యూసీఈఎస్ టీహెచ్) డైరెక్టర్గా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ దామోదరం నియమితులయ్యారు. ఆయన యూసీఈఎస్ టీహెచ్లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం మెకానికల్ ఇంజినీరింగ్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ కే విజయకుమార్రెడ్డి నుంచి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
యూసీఈఎస్టీహెచ్లోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్(ఈఈఈ) విభాగం ఎలక్ట్రికల్-ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ జయలక్ష్మి, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్గా నియమితులయ్యారు. ఆమె యూసీఈఎస్టీహెచ్లోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కే వెంకటేశ్వరరావు నుంచి బాధ్యతలు స్వీకరించారు.