హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద(ఏఐఐఏ)ను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ఆయుష్, ఆరోగ్యశాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్కు మంత్రి లేఖ రాశారు. ఆ లేఖను శనివారం రాష్ర్టానికి వచ్చిన కేంద్ర మంత్రికి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్బాబు కలిసి అందజేశారు. 2030 నాటికి దేశంలో 10 ‘ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద’(ఏఐఐఏ)లను నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, అందులో ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. తెలంగాణ అడవుల్లో అద్భుతమైన ఆయుర్వేద సంపద ఉన్నదని పేరొన్నారు. రాష్ట్రంలో వందల ఏండ్లుగా ఆయుష్ వైద్య విధానాలకు మంచి ప్రాచుర్యం ఉన్నదని తెలిపారు. కేం ద్రం ఏర్పాటు చేసే ఆయుర్వేద ఇనిస్టిట్యూట్స్ లో ఒకటి తెలంగాణకు కేటాయించాలని, అందుకు అవసరమైన భూమి, ఇతర వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు.