Osmania Hospital | హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిలో నూతన ఎంఆర్ఐ, మెడికల్ ఓపీ, డైట్ కిచెన్ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం అందించాలనే తపన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. వైద్య చికిత్స అందించే ప్రొసీజర్స్ పెంచాం. చికిత్స అందించే విషయంలో ధరలను కూడా సవరించామని తెలిపారు. క్యాన్సర్, ట్రామా కేర్ గురించి సమీక్ష చేశామన్నారు. ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయాలనేది తమ లక్ష్యమని దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.