తుర్కపల్లి: శ్రద్ధ, ఆసక్తితో కష్టించి పనిచేసినప్పుడే ఎంచుకున్న రంగంలో విజయాన్ని సాధించవచ్చునని నేషనల్ ఎగ్కో ఆర్డినేషనల్ కమిటీ అడ్వైజర్, పౌల్ట్రీ స్పెషలిస్ట్ కె. బాలస్వామి అన్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో గురువారం పశుసంవర్థక శాఖ, ఎస్సీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో దళితులకు పశుపోషణ పై అవగాహన సమావేశం ఏర్పా టు చేశారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ సీహెచ్ రమేశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వాసాలమర్రిని దత్తత తీసుకోవడం గ్రామస్తుల అదృష్టమన్నారు.
ఈ నెల 4న సీఎం రెండో సారి గ్రామాన్ని సందర్శించి దళితుల ఆర్థిక స్థితిగతులను స్వయంగా అడిగి తెలుసుకోవడమే కాక గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు 10లక్షలు చోప్పున రూ.7.60కోట్లు మంజూరు చేయడంతో పాటు నిధులు విడుదల చేశారన్నారు. సీఎం కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని వంద శాతం నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి దళిత కుటుం బంపై ఉందన్నారు. యూనిట్లను ఎంచుకునే క్రమంలో ఒకటికి పదిసార్లు ఆలో చించుకోని ఏ రంగంలో అనుభవం ఉందో ఆయా రంగాలలో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా ఎదగాలన్నారు.
గ్రామంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి వ్యవసాయ భూములు ఉన్నాయని ఆ రంగంపై ఆధార పడుతున్న కుటుంబా లు రైతుబంధు కింద వచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా ఎదగాలన్నారు. కుటుంబానికి వచ్చిన రూ.10లక్షల్లో రూ.5లక్షలు పాడిరంగానికి, మిగిలిన రూ.5లక్షలు ఇతర రంగాలకు కేటాయించుకోవాలన్నారు. పాడి రంగానికి కేటాయించుకున్న రూ.5లక్షలతో గేదెలు, పోట్టెల్లు, నాటుకోళ్ల పెంపకం చేపట్టి కష్టపడి పనిచేయడం ద్వారా నేలకు రూ.40వేల వరకు ఆదాయం పొందవచ్చునన్నారు.
వచ్చిన పాలను రైతులు పాల కేంద్రంలో కాకుండా హైదరాబాద్కు తరలించి అపార్ట్మెంట్లలో పోయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చునన్నారు. పొట్టెలు, నాటుకోళ్లకు మార్కెట్లో మంచి ఆదరణ ఉన్నందున ఆ రంగంపై దృష్టి సారించి లాభాలు పొందాలన్నారు. లబ్ధిదారులు విడివిడిగా యూనిట్లు పెంచు కోవడంతో పాటు ముగ్గురు, నలుగురు కలిసి ఒక పెద్ద యూనిట్ను ఏర్పాటు చేసుకుంటే సమిష్టి కృషితో ఆర్థికంగా ఎదిగే అవకాశముందన్నారు.
వాసాలమర్రి దళితులు రైతుబంధు నిధులను సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా ఎదిగి రాష్ట్రానికి అండగా నిలవాలన్నా రు. సమావేశంలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి కృష్ణ, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, పశు సంవర్థక శాఖ సహ య సంచాలకుడు అయిలయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, పంచాయతీ అధి కారి పండింట్రెడ్డి, భువనగిరి సహయసంచాలకుడు గోపిరెడ్డి, శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.