జమ్మికుంట, మే 19: దళిత బంధు దేశానికే దిక్సూచిగా నిలిచిందని, ప్రపంచంలోనే ఎక్కడా లేని పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ స్పష్టం చేశారు. దళితులను ధనికులుగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఆయనకు ప్రతి కుటుంబం వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు.
గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి ఇంటికి వచ్చారు. అక్కడే దళిత బంధు కింద మంజూరైన యూనిట్ టాటా ఏస్ వాహనాన్ని లబ్ధిదారుడు అరుణ్కుమార్కు అందజేసి అతడిని సన్మానించారు. అనంతరం వినోద్కుమార్ మాట్లాడుతూ.. దళితబంధు లబ్ధిదారులు పలు రకాలైన వ్యాపారాలు, వాహనాలు పొందారని, ఆయా రంగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు.
పథకాన్ని సద్వినియోగం చేసుకొని వ్యాపారాల్లో రాణించాలని సూచించారు. ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజుల్లోనే ప్రతి నియోజకవర్గంలోనూ దళిత బంధు అమలు చేసేందుకు సీఎం ప్రణాళిక తయారు చేస్తున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ రవీందర్రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు జీవీ, జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, కౌన్సిలర్ దిడ్డి రాము, హమాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు వొల్లాల శ్రీనివాస్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు లింగారావు, నాయకులు, తదితరులున్నారు.