జమ్మికుంట, డిసెంబర్ 27: దళితబంధు లబ్ధిదారులకు రెండో విడత నిధులు మంజూరు చేయాలని దళిత ఐక్య వేదిక నాయకులు డి మాండ్ చేశారు. దళిత ఐక్య వేదిక హుజూరాబాద్ నియోజకవర్గ నేత మంద రాజేశ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులు బుధవారం కరీంనగర్ జి ల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం ఎదు ట ఆందోళన చేపట్టారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ భూపాల్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకం ప్రవేశపెట్టి లబ్ధిదారులను ఎంపిక చేసిందని తెలిపారు. యూనిట్ల ఎంపిక తర్వాత మొదటి విడత కింద సగం డబ్బులు రూ.5 లక్షలు విడుదల చేశారని, ఎన్నికల కోడ్ వచ్చిందంటూ మిగితా డబ్బులు ఇప్పటివరకు అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసినా డబ్బులు ఎందుకు విడుదల చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.