హైదరాబాద్ : దళిత బంధు(Dalita Bandu)లో అక్రమాలు జరుగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్ష(Review) సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత బంధు క్రింద వచ్చిన దరఖాస్తులను కిందిస్థాయిలో పరిశీలించి పక్కాగా అమలు చేయాలని అన్నారు.
కార్పొరేషన్ ఈడీలు ఫీల్డ్ లో తిరిగాలని సూచించారు. లబ్ధిదారులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, దళిత బంధు ద్వారా లబ్ధి పొందుతున్న వారీ నెల ఆదాయం వస్తుందో కూడా తెలుసుకోవాలని అన్నారు.దళిత బంధులో అమలు చేస్తున్న కొన్ని స్కీమ్స్ లు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు ఇచ్చిన దళిత బంధు స్కీ్ం విజయవంతంగా నడుస్తున్న వాటిపై అవగాహన పెంచాలన్నారు. అలాంటి వాటిని ఎక్కువ లబ్ధిదారులకు వచ్చేలా చూడాలని ఆదేశించారు.
దళిత బంధు కింద అందజేసిన యూనిట్స్ ఎక్కడ కూడా ఫెయిల్ కావద్దని పేర్కొన్నారు. ఆవులు, బర్రెలు ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు వాటి పెంపకంపై ఎప్పటికప్పుడూ పశు వైద్యుల చేత వాటి ఆరోగ్యం పై వైద్యుల సలహాలు సూచనలు అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మేనేజింగ్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.