హుజూరాబాద్ రూరల్, అక్టోబర్ 17: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు స్కీం గొప్ప పథకమని లండన్కు చెందిన ఎన్ఆర్ఐ దంపతులు సుమన్-సమంతా ఎలిజబెత్ కొనియాడారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్లో దళితబంధు యూనిట్లను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి అదే గ్రామానికి చెందిన ఇమ్మాన్యుయేల్-వేజీ కుమారుడు సుమంత్, తన భార్య సమంతా ఎలిజబెత్తో కలిసి హాజరయ్యారు. తాము ఏన్నో దేశాలు, భారత్లోని అనేక రాష్ర్టాలు తిరిగామని, కానీ దళిత బంధు వంటి పథకం ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు ఈ పథకంతో ఎందరో పేదల బతుకుల్లో వెలుగులు విరజిమ్ముతాయని పేర్కొన్నారు. ఇంత గొప్ప పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు.