వికారాబాద్, మహబూబ్నగర్/వనపర్తి, జనవరి 10 : దళితబంధు రెండో విడతలో ఎంపికైన వారికి వెంటనే నిధులు విడుదల చేయాలని పలు జిల్లాల్లో బుధవారం ఆందోళనలు నిర్వహించారు. వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట దళితబంధు సాధన సమితి, దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇందులో దాదాపు వెయ్యి మంది లబ్ధిదారులు పాల్గొన్నారు.
అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాగా మహబూబ్నగర్ కలెక్టరేట్ ఎదుట మహ్మదాబాద్, గండీడ్ మండలాలకు చెందిన లబ్ధిదారులు, వనపర్తి కలెక్టరేట్ వద్ద దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దళితబంధు పథకం అమలు ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. దళితబంధును కొనసాగించి ఎంపికైన లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలని కోరారు.