సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేసి థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉందని, ప్రస్తుతం రోజుకు 30 రైల్వేర్యాక్స్ ద్వారా జరుగుతున్న బొగ్గురవాణాను 34 ర్యాక్స్కు పెంచాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సింగరేణి పరిధిలోని 9 కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నుంచి జరుగుతున్న బొగ్గురవాణాపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈయేడు 700 లక్షల టన్నుల బొగ్గు రవాణా లక్ష్యంతో ముందుకు పోతున్నందున.. ఇందుకు అనుగుణంగా కొత్త సీహెచ్పీల నిర్మాణం పూర్తికావాలని సూచించారు.