హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు మోకా, బిపర్జోయ్ తుపానులు ప్రతిబంధకాలుగా మారాయి. రుతుపవనాల ప్రవేశం నుంచి విస్తరణ వరకు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ఫలితంగా ఒకవైపు వడగాల్పులు విజృంభిస్తుంటే, మరోవైపు వర్షాలకు బ్రేకులు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీలోకి ప్రవేశించినా మందకొడిగా కదులుతున్నాయి. ఈ నెల 11న అవి రాయలసీమను తాకినా ఆ తర్వాత పెద్దగా ముందు కు కదల్లేదు. ఈ పాటికి రాయలసీమలోని అన్ని జిల్లాలకు విస్తరించి తెలంగాణ, కోస్తా జిల్లాల్లోకి ప్ర వేశించాల్సి ఉంది.
కానీ, బుధవారం వరకు ఇంకా రాయలసీమలోనే పూర్తిగా విస్తరించలేదు. ఈ నెల 16 వరకు రుతుపవనాలు ఇలా నెమ్మదిగానే కదిలే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. బిపర్జోయ్ తుపాను ప్రభావం 16వ తేదీ నుంచి తగ్గే అవకాశం ఉండటంతో ఆ తర్వాత గమనంలో వేగం పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నాటికి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అప్పటి నుంచి వాతారణం చల్లబడి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అక్కడక్కడా వర్షాలు పడుతున్నా అది నామమాత్రంగానే ఉంది.
3 రోజులు తీవ్ర ఎండలు
వ చ్చే మూడు రోజులు ఎండలు దంచికొట్టనున్నాయ ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నది. బుధవారం నుంచి గురువారం వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జన గాం, సిద్దిపేట, యాద్రాద్రి, రంగారె డ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.