హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తండ్రి, మాజీ పోలీసు అధికారి ముత్యా ల బెంజిమన్ రంజిత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందు తూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 1968లో ఎస్సైగా పోలీసు శాఖ లో చేరిన రంజిత్ ప్రజలకు అనేక సేవలందించారు. ఎస్సై నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ 2000 సంవత్సరంలో ఆసిఫ్నగర్ ఏసీపీగా పదవీ విరమణ పొందారు. రంజిత్ మరణవార్త తెలుసుకొన్న డీజీపీ అంజనీకుమార్, ఇతర ఉన్నతాధికారులు మహేశ్ భాగవత్, నగర సీపీ సందీప్ శాండిల్య తదితరులు దవాఖానకు చేరుకొని భౌతికకాయానికి నివాళులర్పించారు. స్టీఫెన్ రవీంద్రకు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.