హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లిలో నూతనంగా నిర్మించిన పోలీసు స్టేషన్ను సీపీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సీపీ సజ్జనార్ పాల్గొని వేప మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అరబిందో ఫార్మా సంస్థల చైర్మన్ నిత్యానందరెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.