హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): అమాయకత్వం.. ఏదయినా కొత్తదానిని నేర్చుకోవాలనే ఉత్సాహం.. ఆవేశం.. ఏదయినా చేయగలమనే అతి విశ్వాసం.. నలుగురులో ప్రత్యేక గుర్తింపు కోసం ఆరాటం.. ఇదీ నవయవ్వన జీవన విధానం. అయితే ఇదే ఇప్పుడు అనేక అనర్థాలకు దారితీస్తున్నది. సోషల్మీడియాలో బాలలు, టీనేజీ కుర్రకారును కేటుగాళ్లు వేధింపులు గురిచేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మనదేశంలో దాదాపు 85 శాతం మంది పిల్లలు సైబర్ బెదిరింపులకు గురవుతున్నారని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని గ్లోబల్ కంప్యూటర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫే కార్ప్ ఇటీవల విడుదల చేసిన సర్వేలో తెలిపింది.
సైబర్ బెదిరింపులకు సంబంధించి కొత్త పర్యవసాన ధోరణులను వెలికితీసేందుకు మెకాఫే కార్ప్, మార్కెట్ పరిశోధన సంస్థలు జూన్ 15 నుంచి జూలై 5 వరకు బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇండియా, కెనడా, జపాన్, బ్రెజిల్, మెక్సికో తదితర 10 దేశాల్లో 10-18 ఏండ్లలోపు పిల్లలున్న 11,687 మంది తల్లిదండ్రులను ఆన్లైన్ ద్వారా సర్వే చేశాయి. స్నాప్ చాట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర 14 సోషల్ మీడియా సంస్థలను పరిశోధించాయి. ఇలా సేకరించిన సమాచారంతో ‘సైబర్ బుల్లీయింగ్ ఇన్ ప్లెయిన్ సైట్’ పేరుతో మెకాఫే నివేదిక విడుదల చేసింది.
నివేదికలోని కీలక అంశాలు