హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం.. పెట్టిన పెట్టుబడికి రోజువారీ, నెలవారీగా తిరిగి చెల్లింపులు అంటూ ఊదరగొట్టే ఆన్లైన్ యాప్లను నమ్మి మోసపోవద్దని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. అమాయకులే లక్ష్యంగా కేటుగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారని, జాగ్రత్తగా ఉం డాలని హెచ్చరిస్తున్నారు. పవర్ బ్యాంక్, లైట్నింగ్ పవర్ బ్యాంక్, వెస్టాస్ విండ్ వం టి మొబైల్ యాప్లు మోసపూరితమైనవి గా గుర్తించినట్టు రాష్ట్ర పోలీసులు వెల్లడించారు. ఈ యాప్లలో పెట్టుబడి పెడితే ఎన్నో రెట్ల లాభాలు వస్తున్నాయని ఆన్లైన్లో పెట్టే రివ్యూలన్నీ బోగసేనని స్పష్టంచేశారు. కొన్ని కంపెనీలకు డబ్బులిచ్చి పెయిడ్ ఓపీనియన్స్ రాయిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి మోసపూరిత యాప్లను గుర్తిస్తే www.cybercrime.gov.in లేదా 155260 నంబర్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.