శ్రీశైలం : శ్రీశైలం జలాశయాన్ని సోమవారం పాండ్యన్ నేతృత్వంలోని 15 మంది సభ్యులు సెంట్రల్ బోర్డ్ సేఫ్టీ రివ్యూ కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా రేడియల్ క్రస్ట్గేట్ల పనితీరు, గ్యాలరీ బాటమ్లెవల్, గేట్ల నుంచి నీరు పడే బేసిన్, ప్లంజ్ఫూల్, పవర్హౌస్ సేఫ్టీవాల్ను పరిశీలించారు. అదే విధంగా ఇప్పటి వరకు చేసిన మరమ్మతుల వివరాలు తెలుసుకుని భవిష్యత్లో చేపట్టాల్సిన పనులను సర్వే నిర్వహించి నిర్ధారించనున్నట్లు తెలిపారు. జలాశయానికి ప్రపంచ బ్యాంక్ నిధులతో మరమ్మతులు చేయనున్నట్లు బృందం సభ్యులు, ప్రాజెక్టు సీఈ మురళీ తెలిపారు.
డ్రిప్ 2 పథకం కింద ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం 70శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 30శాతం నిధులను కేటాయించనున్నట్లు చెప్పారు. జలాశయంలో నీళ్లు 800 అడుగులకు చేరితే మరమ్మతులు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు జలాశయంపైన మాత్రమే చూశామని కమిటీ సభ్యులు, అధికారులతో కలిసి జలాశయంపై చేసిన వివిధ సర్వేలు, వీడియోగ్రఫీ, ఫొటో గ్రఫీ ద్వారా సమీక్ష నిర్వహిస్తామని సీడబ్ల్యూసీ కమిటీ పేర్కొంది. సమీక్ష అనంతరం నివేదికను రూపొందించి, ప్రభుత్వానికి అందజేయనున్నట్లు పేర్కొంది. మంగళవారం కూడా జలాశయాన్ని కేంద్ర బృందం పరిశీలించనున్నది.