నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని గోదాముల నుంచి బియ్యం నిల్వలను తరలించకుండా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) జగన్నాటకానికి తెరతీసింది. కేంద్రప్రభుత్వ డైరెక్షన్లో తెలంగాణ రైతులపట్ల్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. వడ్లు, బియ్యం తీసుకోండి మొర్రో అని నెలనుంచి మొత్తుకుంటున్నా, చేతిలో ఉన్న గోదాములను ఖాళీ చేయలేదు. ఖాళీగా ఉన్న గోదాములను లీజుకైనా తీసుకోలేదు. ఫలితం.. వడ్లు అమ్ముడుపోక రైతన్నల గుండెలు ఆగుతున్నాయి. బియ్యం నిల్వలు పేరుకుపోయి రైస్ మిల్లులు మూత పడుతున్నాయి.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఖాళీ గోదాములున్నా ఏదో ఒక కొర్రీ పెట్టి ఎఫ్సీఐ ఒకటిరెండు గోదాములతోనే పనికానిచ్చేస్తున్నది. అవి కూడా సమయానికి ఖాళీ చేయకుండా రైతులను, మిల్లర్లను అరిగోస పెడుతున్నది. ఎఫ్సీఐ గోదాముల్లో మూలుగుతున్న బియ్యాన్ని వేరేచోటికి తరలించేందుకు రైల్ ర్యాక్లను సరైన సమయానికి, సరిపడినన్ని పంపకపోవటంతో కొత్తగా వచ్చే బియ్యాన్ని నిల్వచేసేందుకు చోటు ఉండటంలేదు. దాంతో గత యాసంగిలో తీసుకోవాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని ఇంకా తీసుకోకుండా జాప్యం చేస్తున్నది. ఇదేమిటని అడిగితే గోదాములు ఖాళీ లేవని చెప్తున్నది. బియ్యం లోడుతో వెళ్లిన లారీలు ఎఫ్సీఐ గోదాముల వద్ద వారాలతరబడి వేచిచూస్తుండటంతో ఇటు మిల్లర్లు, అటు లారీల డ్రైవర్లు, యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. గోదాముల్లో ఎగుమతి దిగుమతి నిలిచిపోయి వేలమంది హమాలీలకు పనిలేకుండా పోయింది. మిల్లుల్లో బియ్యం పేరుకుపోయి చాలాచోట్ల మరాడించటం నిలిపేస్తున్నారు. దాంతో అక్కడా వేలమంది ఉపాధి కోల్పోతున్నారు. యాదాద్రి జిల్లాలో గత యాసంగికి సంబంధించి ఎఫ్సీఐ తీసుకోవాల్సిన సీఎంఆర్ బియ్యం 2,89,081 టన్నులు కాగా, ఇప్పటివరకు తీసుకున్నది 1,27,712 టన్నులే.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లోని ధాన్యాన్ని సేకరించి బియ్యాన్ని తీసుకొనేందుకు ఎఫ్సీఐ ఖమ్మంలో రెండు గోదాములను ఏర్పాటుచేసింది. సారథినగర్లో 75 వేల టన్నులు, ప్రకాశ్నగర్లో 13 వేల టన్నుల సామర్థ్యంతో గోదాములున్నాయి. ఈ నాలుగు జిల్లాల పరిధిలో ఏటా దాదాపు 3 లక్షల టన్నుల బియ్యాన్ని రాష్ట్రప్రభుత్వం ఎఫ్సీఐకి ఇస్తున్నది. ఆ మొత్తం బియ్యం ఈ రెండు గోదాముల్లోనే నిల్వ చేయాలి. ఏటా 2.12 లక్షల టన్నుల బియ్యాన్ని అన్లోడ్ చేసే పరిస్థితి లేక రోడ్లపై ఉంచుతున్నారు. దీంతో లారీ యాజమానులు, డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 5,10,265 టన్నుల బియ్యం టార్గెట్ ఉండగా, మిల్లర్లు 3,39,426 టన్నులు సరఫరా చేశారు. ఇంకా 1,70, 839 టన్నులు మిల్లుల్లోనే ఉండిపోయాయి. గత ఆరు నెలల్లో నెలకు సరాసరి 12 వ్యాగన్లు మాత్రమే వచ్చాయి. దాంతో ఇప్పటివరకు 1.50 లక్షల టన్నుల బియ్యం మాత్రమే ఎఫ్సీఐ తరలించింది. కామారెడ్డి జిల్లాలో 2,99,790 టన్నుల బియ్యం టార్గెట్ ఉండగా, 1,21,133 టన్నులు ఎఫ్సీఐకి చేరింది. వ్యాగన్లు రాక గోదాముల్లో చోటులేకపోవటంతో ఇంకా 1,78,650 టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. నెలరోజులుగా ఒక్క వ్యాగన్ కూడా రాలేదు. మేడ్చల్ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉన్నది. చర్లపల్లిలోని ఎఫ్సీఐ గోదాంలో 1.40 లక్షల టన్నుల బియ్యం స్టాక్ ఉన్నది. ఇక్కడి నుంచి వారంలో ఒకటిరెండు ర్యాక్లతోనే బియ్యం తరలిస్తున్నారు. ఇలా నెలకు 20 వేల టన్నులకు మించి వెళ్లటంలేదు. గత యాసంగిలో మేడ్చల్ జిల్లా నుంచి 25,650 టన్నుల బియ్యం సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 12,678 టన్నులే తీసుకున్నారు.
ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ప్రతి సీజన్లో నాలుగైదు నెలల్లోనే నిర్దేశించిన సీఎంఆర్ను ప్రభుత్వానికి ఇచ్చేవాళ్లం. ఎఫ్సీఐ తీరు వల్ల ఈసారి టార్గెట్లో సగం కూడా పూర్తి చేయలేకపోయాం. బియ్యం నిల్వలు పేరుకుపోవడంతో 20 రోజులుగా మిల్లులను మూసివేశాం. రోజుల తరబడి లారీలను గోదాముల వద్ద ఉంచడంతో వెయిటింగ్ చార్జీలు అదనపు భారమవుతున్నాయి. ఇలా అయితే భవిష్యత్తులో మిల్లులను నడపలేం.
పసునూరి నాగభూషణం, రైస్మిల్లర్స్
బియ్యం అన్లోడ్ చేసేందుకు ఆలేరు రైస్మిల్లు నుంచి 14 రోజుల క్రితం నాగిరెడ్డిపల్లి ఎఫ్సీఐ గోదాముకు వచ్చిన. తాత్కాలిక డ్రైవర్ కావడం వల్ల ట్రిప్పుకు రూ.వెయ్యి ఇస్తరు. ఆ ఆశతోనే వచ్చి ఇరుక్కుపోయిన. గతంలో ఒకటి, రెండు రోజుల్లోనే అన్లోడ్ అయి ప్రతి ట్రిప్పుకు రూ.వెయ్యి లెక్కన వచ్చేవి. ఈసారి 14 రోజులకు కలిపి రూ.వెయ్యే వస్తయ్. ఇట్ల అయితే కుటుంబాన్ని ఎట్ల పోషించేది? – మల్లికార్జున్, లారీ డ్రైవర్
సీఎంఆర్ బియ్యం సగమే వచ్చింది
గత యాసంగికి సంబంధించి సీఎంఆర్ సేకరణ లక్ష్యాన్ని సగంమే సాధించగలిగాం. ఒక్క గోదాముకే అనుమతి ఇవ్వడం వల్ల బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోయాయి. – గోపీకృష్ణ, పౌరసరఫరాల శాఖ డీఎం
సీఎంఆర్ బియ్యం సగమే వచ్చింది
గత యాసంగికి సంబంధించి సీఎంఆర్ సేకరణ లక్ష్యాన్ని సగంమే సాధించగలిగాం. ఒక్క గోదాముకే అనుమతి ఇవ్వడం వల్ల బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోయాయి. – గోపీకృష్ణ, పౌరసరఫరాల శాఖ డీఎం
ర్యాక్లు రాకపోవడం తో లారీల నుంచి బియ్యం అన్లోడ్ చేయడం ఆలస్యమైతున్నది. ఎప్పటికపుడు ర్యాక్లు వస్తే గోదాముల్లో ఖాళీ స్థలం ఉంటది. రెండుమూడు రోజలకు ఒక ర్యాక్ వస్తున్నది. యాద రాములు, ఎఫ్సీఐ హమాలి అవసరం 40 ర్యాక్లు.. వచ్చినవి 15 హనుమకొండ జిల్లాలోని కాజీపేట ఎఫ్సీఐ గోదాము సామర్థ్యం 1.10 లక్షల టన్నులు. ఇక్కడి నుంచి బియ్యం తరలింపునకు నెలకు అవసరమైన ర్యాక్లు 40. ఎఫ్సీఐ పంపుతున్నది 15.జిల్లాలో 2020-21 యాసంగిలో రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేసి 25 మిల్లులకు ఇచ్చిన ధాన్యం 2,27,633 టన్నులు.మిల్లర్లు సీఎంఆర్ కింద ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన బియ్యం 1,54,709 టన్నులు. రంగారెడ్డి జిల్లా..జిల్లాలో ఎఫ్సీఐ సేకరించాల్సిన బయ్యం 69,916 టన్నులు.ఇప్పటివరకు సేకరించింది 27,550 టన్నలు.ఇంకా తీసుకోవాల్సింది 19,992 టన్నులు.బియ్యం అన్లోడ్ కోసం గోదాముల వద్ద లారీలు వేచి ఉంటున్న సగటు రోజులు 15.
బాయిల్డ్ బియ్యాన్ని సేకరించకూడదని కేంద్రప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ మిల్లుల మనుగడను ప్రశ్నార్థకం చేసింది. రైస్మిల్లర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2,627 రైస్ మిల్లులు ఉండగా, ఇందులో సీఎంఆర్పైనే ఆధారపడిన బాయిల్డ్ మిల్లులు 950కి పైగా ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోనే 225 వరకు బాయిల్డ్ మిల్లులున్నాయి. రెండుమూడేండ్లుగా రాష్ట్రంలో వరి దిగుబడి బాగా పెరగటంతో మరాడించే సామర్థ్యం పెంచుకోవాలని ఈ మిల్లుల యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది. అందుకనుగుణంగా మిల్లుల యజమానులు దాదాపు రూ.150 కోట్లు ఖర్చుపెట్టి సామర్థ్యం పెంచుకొన్నారు. ఇప్పుడు కేంద్రం ఉన్నట్టుండి బాయిల్డ్ రైస్ కొనకూడదని నిర్ణయించటంతో ఈ మిల్లులపై పిడుగుపడ్డట్టయ్యింది. ఇప్పుడు ఈ మిల్లుల్లో ఎక్కువ శాతం మూతైనా పడాలి.. రా రాస్ మిల్లులుగానైనా మారాలి. ఒక మిల్లు బాయిల్డ్ టెక్నాలజీ నుంచి రా రైస్కు మారాలంటే కనీసం రూ.5 కోట్లవరకు ఖర్చవుతుంది. ఇప్పటికిప్పుడు ఇది సాధ్యంకాదని మిల్లుల యజమానులు అంటున్నారు. బాయిల్డ్ రైస్ మిల్లులపై ఆధారపడి వేలమంది జీవిస్తున్నారు. ఈ మిల్లులు మూతపడితే వారంతా జీవనోపాధి కోల్పోతారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 25 వేల మందికిపైగా సిబ్బంది, హమాలీలు, లారీ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు, వాటిపై ఆధారపడే గ్యారేజీ సిబ్బంది జీవనోపాధికి ప్రమాదం ఏర్పడింది.
నిజామాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధాన్యం నాణ్యత లేదంటూ లారీలను తిప్పిపంపుతున్న మిల్లర్లపై ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాలుగు రోజులుగా వడ్ల లోడును దించుకోకుండా మిల్లుకూ మిల్లుకూ తిప్పతుండటంపై మండిపడ్డారు. ఆ వడ్ల లారీతో నేరుగా కలెక్టరేట్కు వచ్చారు. రైతుల నుంచి ధాన్యం సాఫీగా మిల్లులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ను కోరారు. కామారెడ్డి మండలం లింగాపూర్లో డిసెంబర్ 3న సేకరించిన ధాన్యాన్ని అధికారులు దేవునిపల్లిలోని సాయిశ్రీనివాస్ రైస్మిల్లుకు కేటాయించారు. తేమ శాతం ఎక్కువుందంటూ లోడును దించుకునేందుకు సదరు మిల్ యజమాని నిరాకరించాడు. అనంతరం తాసిల్దార్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు ఈ నెల 4న లారీని ఉగ్రవాయిలోని వెంకటేశ్వర రైస్మిల్లుకు పంపించారు. ఆ మిల్లు యజమాని సైతం ధాన్యం నాణ్యత తక్కువగా ఉన్నదని చెప్తూ అన్లోడింగ్కు ససేమిరా అన్నాడు. మంగళవారం సాయంత్రం తిరిగి కొనుగోలు కేంద్రానికి పంపారు. ఆందోళనకు గురైన రైతులు.. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన విప్.. ఆ ధాన్యం లారీతో కలెక్టరేట్కు వచ్చి మిల్లర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల్ని ఇబ్బందిపెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, డీఎస్వో, పౌరసరఫరాలశాఖ మేనేజర్కు ఫిర్యాదు చేశారు. అధికారులు వెంటనే ధాన్యం లారీని తిరిగి వెంకటేశ్వర మిల్లుకు పంపారు.
బాయిల్డ్ బియ్యాన్ని సేకరించకూడదని కేంద్రప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ మిల్లుల మనుగడను ప్రశ్నార్థకం చేసింది. రైస్మిల్లర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2,627 రైస్ మిల్లులు ఉండగా, ఇందులో సీఎంఆర్పైనే ఆధారపడిన బాయిల్డ్ మిల్లులు 950కి పైగా ఉన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోనే 225 వరకు బాయిల్డ్ మిల్లులున్నాయి. రెండుమూడేండ్లుగా రాష్ట్రంలో వరి దిగుబడి బాగా పెరగటంతో మరాడించే సామర్థ్యం పెంచుకోవాలని ఈ మిల్లుల యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది. అందుకనుగుణంగా మిల్లుల యజమానులు దాదాపు రూ.150 కోట్లు ఖర్చుపెట్టి సామర్థ్యం పెంచుకొన్నారు. ఇప్పుడు కేంద్రం ఉన్నట్టుండి బాయిల్డ్ రైస్ కొనకూడదని నిర్ణయించటంతో ఈ మిల్లులపై పిడుగుపడ్డట్టయ్యింది. ఇప్పుడు ఈ మిల్లుల్లో ఎక్కువ శాతం మూతైనా పడాలి.. రా రాస్ మిల్లులుగానైనా మారాలి. ఒక మిల్లు బాయిల్డ్ టెక్నాలజీ నుంచి రా రైస్కు మారాలంటే కనీసం రూ.5 కోట్లవరకు ఖర్చవుతుంది. ఇప్పటికిప్పుడు ఇది సాధ్యంకాదని మిల్లుల యజమానులు అంటున్నారు. బాయిల్డ్ రైస్ మిల్లులపై ఆధారపడి వేలమంది జీవిస్తున్నారు. ఈ మిల్లులు మూతపడితే వారంతా జీవనోపాధి కోల్పోతారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 25 వేల మందికిపైగా సిబ్బంది, హమాలీలు, లారీ ఓనర్లు, డ్రైవర్లు, క్లీనర్లు, వాటిపై ఆధారపడే గ్యారేజీ సిబ్బంది జీవనోపాధికి ప్రమాదం ఏర్పడింది.
నిజామాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధాన్యం నాణ్యత లేదంటూ లారీలను తిప్పిపంపుతున్న మిల్లర్లపై ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాలుగు రోజులుగా వడ్ల లోడును దించుకోకుండా మిల్లుకూ మిల్లుకూ తిప్పతుండటంపై మండిపడ్డారు. ఆ వడ్ల లారీతో నేరుగా కలెక్టరేట్కు వచ్చారు. రైతుల నుంచి ధాన్యం సాఫీగా మిల్లులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ను కోరారు. కామారెడ్డి మండలం లింగాపూర్లో డిసెంబర్ 3న సేకరించిన ధాన్యాన్ని అధికారులు దేవునిపల్లిలోని సాయిశ్రీనివాస్ రైస్మిల్లుకు కేటాయించారు. తేమ శాతం ఎక్కువుందంటూ లోడును దించుకునేందుకు సదరు మిల్ యజమాని నిరాకరించాడు. అనంతరం తాసిల్దార్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు ఈ నెల 4న లారీని ఉగ్రవాయిలోని వెంకటేశ్వర రైస్మిల్లుకు పంపించారు. ఆ మిల్లు యజమాని సైతం ధాన్యం నాణ్యత తక్కువగా ఉన్నదని చెప్తూ అన్లోడింగ్కు ససేమిరా అన్నాడు. మంగళవారం సాయంత్రం తిరిగి కొనుగోలు కేంద్రానికి పంపారు. ఆందోళనకు గురైన రైతులు.. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన విప్.. ఆ ధాన్యం లారీతో కలెక్టరేట్కు వచ్చి మిల్లర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల్ని ఇబ్బందిపెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, డీఎస్వో, పౌరసరఫరాలశాఖ మేనేజర్కు ఫిర్యాదు చేశారు. అధికారులు వెంటనే ధాన్యం లారీని తిరిగి వెంకటేశ్వర మిల్లుకు పంపారు.