హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వానకాలం సాగు జోరు కొనసాగుతున్నది. బుధవారం కల్లా రాష్ట్రవ్యాప్తంగా 80.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
ఇందులో గరిష్ఠంగా పత్తి 45.42 లక్షల ఎకరాలు, వరి 18.07 లక్షల ఎకరాలు, కంది 5.17 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3.49 లక్షల ఎకరాల్లో సాగు అయ్యాయి. ఇటీవల ఎడతెరిపిలేని వర్షాల కారణంగా సాగు కాస్త నెమ్మదించింది. నిరుడు ఇదే సమయానికి 95 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయడం గమనార్హం.