హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఆహార ధరల పెరుగుదలతో దేశంలో 71 శాతం మంది, ప్రపంచవ్యాప్తంగా 42 శాతం మంది పౌష్టికాహారాన్ని తీసుకోలేకపోతున్నారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్(సీఎస్ఈ) ఈ మధ్యే వెల్లడించింది. తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు, పాల పదార్థాలు, మాంసం తగిన మోతాదులో తీసుకోలేకపోతున్నారని, ఫలితంగా ఏటా 17 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. పౌష్టికాహారం కోసం ఎక్కువ ఖర్చు చేయలేనివారి కోసం తక్కువ ఖర్చుతో సమతుల ఆహారాన్ని తీసుకొనే ప్రణాళికను సీఎస్ఈ సూచించింది. 8 సూచనలతో ఈట్ లాన్సెట్ రిఫరెన్స్ ఫుడ్ ప్లాన్ను విడుదల చేసింది.
తక్కువ ఖర్చుతో సమతుల ఆహారం