హైదరాబాద్ : నగరంలో చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఎన్డీపీ) పనుల పురోగతిపై సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, ఈఎన్సీలు, జోనల్ కమిషనర్లు హాజరయ్యారు. ఎస్ఎన్డీపీ పనులు యుద్ధప్రతిపాదికన చేపట్టాలి అని సీఎస్ ఆదేశించారు. ప్రతి మంగళవారం ఎస్ఎన్డీపీ పనులపై సమీక్షిస్తానని చెప్పారు. ఈ పనులకు వివిధ శాఖల బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్య నాలాల పరిస్థితిని ప్రతి వారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తానని సీఎస్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.