హైదరాబాద్ : రాష్ట్రంలో సాగు, అనుబంధ రంగాల ద్వారా జీఎస్డీపీ పెంపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి భేటీ నిర్వహించారు. సీనియర్ ఐఏఎస్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో విధాన మార్పులు అవసరమని పేర్కొన్నారు. మరింత వృద్ధి, ఉద్యోగాలు, పెట్టుబడులు వచ్చేలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. శాఖల పనితీరు, సమర్థత పెరగాల్సిన అవసరం ఉందని సీఎస్ స్పష్టం చేశారు. ఉత్పాదకత లక్ష్యంగా మార్పులపై శాఖలకు అవగాహన ఉండాలన్నారు. రాష్ట్రంలో సాగు, పశు సంవర్ధక రంగాల్లో వృద్ధికి చాలా అవకాశం ఉందని సీఎస్ సోమేశ్ కుమార్ అన్నారు.