హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణాల నిర్మాణాలను సకాలంలో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను వేగవంతంగా అమలుచేసేందుకు జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లతో బుధవారం బీఆర్కేభవన్లో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
జీవో 58, 59 దరఖాస్తుల ప్రక్రియ, అన్ని జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల గ్రౌండింగ్, గ్రామ క్రీడా ప్రాంగణాల నిర్మాణం, బహుళస్థాయి అవెన్యూ ప్లాంటేషన్లు, బ్లాక్ ప్లాంటేషన్లు, ధాన్యం సేకరణ, దళిత బంధు పథకం యూనిట్ల గ్రౌండింగ్పై చర్చించి పలు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని రైతుల వద్ద తడిసిన ధాన్యం మొత్తం సేకరించాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తాని యా, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల సీఐజీ శేషాద్రి, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, పురపాలకశాఖ డైరెక్టర్ సత్యనారాయణ, అటవీశాఖ పీసీసీఎఫ్ డోబ్రియల్, టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.