హైదరాబాద్, జనవరి 4(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాల్లో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు, జీవో 58,59,76పై త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి సీఎస్ పలు అంశాలపై జిల్లాల వారీగా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు స్థలాల కేటాయింపులు, పల్లె ప్రకృతి వనాల్లో మొక్కల సంరక్షణకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.