హైదరాబాద్ : ఆగస్టు 15న గోల్కొండ కోటపై నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. పంద్రాగస్టు రోజున గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు సీఎస్ తెలిపారు.
ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు లోబడి ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా కళారూపాలు ఉండాలని సీఎస్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటపై నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.