హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షల సన్నద్ధతపై జిల్లాల కలెక్టర్లు, పోలీస్, విద్యాశాఖ, సంబంధిత అధికారులతో ఆమె బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ నెల 28 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు 9.80 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. మొత్తం 1,521 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. వచ్చే నెల 18 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. 2,676 కేంద్రా ల్లో ఈ పరీక్షలు ఉంటాయని తెలిపారు.