హైదరాబాద్, జులై 15 (నమస్తే తెలంగాణ): రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ను సీఎస్ సోమేశ్కుమార్ అభినందించారు. రాతియుగం నుంచి 1323 సంవత్సరం వరకు ‘తెలంగాణలో భూమి, ప్రజలు’ అనే పుస్తకాన్ని ఏకే గోయల్ శుక్రవారం సీఎస్కు అందజేశారు. తెలంగాణ భూములు, ప్రజలపై అధ్యయనశీలతతో ఏకే గోయల్, డీ సత్యనారాయణ, రేఖాపాండే, రావులపాటి మాధవి కలిసి పుస్తకాన్ని తీసుకురావడం పట్ల సీఎస్ ప్రశంసించారు.