హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): మౌలాలికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగిని ఓ ఇన్స్టంట్ లోన్ యాప్ ద్వారా రూ.4 వేలు అప్పు తీసుకొన్నారు. ఆ రుణాన్ని తిరిగి నెలలోపే చెల్లించినా, ఇంకా రుణం కట్టాలని యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేశారు. దీంతో బాధితురాలు రాచకొండ పోలీసులను ఆశ్రయించింది. ఇన్స్టంట్ లోన్లు ఇచ్చే ఓ యాప్ ద్వారా రూ.4 వేల రుణం తీసుకొన్న ఆ ఉద్యోగిని.. తన స్మార్ట్ఫోన్లో రుణ యాప్ అడిగిన వాటన్నింటికీ అంగీకరించి యాక్సెస్ ఇచ్చారు. దీంతో ఆమె ఫోన్లోని ఫోన్ నంబర్లు, గ్యాలరీ, ఇతర అంశాలకు సంబంధించిన వాటిని యాప్ నిర్వాహకులు సేకరించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్నది.