కొండాపూర్, అక్టోబర్ 7: కెమిస్ట్రీ విభాగంలో ఉత్తమ పరిశోధనలకు గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇద్దరు ఫ్యాకల్టీలు కెమికల్ రిసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఆర్ఎస్ఐ)-2022 పతకాలకు ఎంపికైనట్టు వర్సిటీ యాజమాన్యం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ (ఐవోఈ) రిసెర్చ్ చైర్ ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీ, మాజీ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ డీ బసవయ్య బంగారు పతకం, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీ రాము శ్రీధర్ కాంస్య (బ్రాంజ్) పతకం అందుకోనున్నట్టు వెల్లడించింది. ప్రొఫెసర్ బసవయ్య బెయిలీస్ – హిల్మ్యాన్ రియాక్షన్పై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ప్రొఫెసర్ పీ రాము శ్రీధర్ కార్బోహైడ్రేడ్ కెమిస్ట్రీ సింథెటిక్ మెథడ్స్ అభివృద్ధిపై పరిశోధనలు చేస్తున్నారు.