కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 17 : ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆదివారం మావోయిస్టులు జరిపిన మెరుపుదాడి లో ఓ భద్రతా అధికారి మృతిచెందగా, జవాన్కు తీవ్రగాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జగర్గూండ పోలీస్స్టేషన్ పరిధిలోని అంతర్గత ప్రాం తం నుంచి సీఆర్పీఎఫ్ 165వ బెటాలియన్ భద్రతా దళాలు ఉర్సుగల్ వైపు సెర్చింగ్ ఆపరేషన్కు బయలుదేరాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు.
జవాన్లపై కాల్పుల వర్షం కురిపించడంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పు లు జరిపారు. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు పారిపోయారు. అప్పటికే మావోయిస్టుల దాడిలో గాయపడి న సీఆర్పీఎఫ్ ఎస్సై సుధాకర్రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. మరో జవాన్ రాము తీవ్రంగా గాయపడగా చికిత్స ని మిత్తం ఎయిర్లిఫ్టర్తో రాయ్పూర్కు తరలించారు. గాలింపు ముమ్మరం చేసి న భద్రతా దళాలు.. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఎస్సై సుధాకర్రెడ్డి మృతదేహాన్ని హెడ్క్వార్టర్స్కు తరలించారు.