వరంగల్ : ఐనవోలు మల్లికార్జునస్వామి(Iloni mallanna) వారి ఆలయానికి భక్తులు(Devotees) పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ పరిసరాలు ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. మల్లికార్జునస్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. స్వామి వారి సాధారణ దర్శనానికి దాదాపు ఐదు గంటలు, ప్రత్యేక దర్శనానికి దర్శనానికి రెండు సమయం పడుతుంది. కాగా, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు.