హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెం టనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ బుధవా రం ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబురాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతన్నల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం 9 ఏండ్లలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని గుర్తుచేశారు. అనేక సందర్భాల్లో రైతుల వెంట నిలిచిన పార్టీ శ్రే ణులు తాజాగా రైతన్నలకు రుణమాఫీ అం శంలోనూ వారితో కలిసి సంబురాలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతి గ్రా మం నుంచి జిల్లా కేంద్రాల వరకు రైతులతో కలిసి సంబురాలు నిర్వహించాలని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, జిల్లా అధ్యక్షులకు సూచించారు. గురువారం నుం చి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గా ల్లో ఈ సంబురాల విషయమై కార్యక్రమాలను సమన్వయం చేసుకోవాలన్నారు.