ములుగు: ఏటూరు నాగారంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. స్కైవిజన్ కేబుల్ కార్యాలయంపై దాడికి దిగారు. కార్యాలయంలో బలవంతంగా చొరబడిన వాళ్లు.. అక్కడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అలాగే కంట్రోల్ అండ్ మానిటరింగ్ బోర్డు కేబుళ్లు కూడా కట్ చేశారు. అక్కడ నుంచి రూ.70 వేల నగదు చోరీ చేసి పారిపోయారు. వారిన అడ్డుకోవడానికి ప్రయత్నించిన సిబ్బందిపై దాడి చేశారు. దొంగలు చేసిన బీభత్సం అంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది.
కార్యాలయంలో ఉన్న శాటిలైట్ బాక్సులు, నెట్వర్క్ లైన్లను దొంగలు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల గురించి తెలుసుకునేందుకు సీసీ కెమురాలు పరిశీలిస్తున్నారు. దాడిలో గాయపడిన సిబ్బందికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.