యాదాద్రి: మావోయిస్టుల పేరుతో ప్రజలను బెదిరించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు చెందిన నలుగురిని యాదాద్రి ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ముఠా తమ వద్ద ఉన్న తుపాకులతో బెదిరించి దారి దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఒక పిస్తోలు సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.