సంస్థాన్ నారాయణపు రం, సెప్టెంబర్ 7: మునుగోడులో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. నల్లగొండ జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం పుట్టపాకలో బుధవారం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక ప్రజలు కోరుకుంటే వచ్చింది కాదని, రాజగోపాల్రెడ్డి రాజీనామాకు ఢిల్లీలోనే కుట్ర జరిగిందని ఆరోపించారు. బీజేపీని ఓడించే శక్తి కేవలం టీఆర్ఎస్కు మాత్ర మే ఉన్నదని తెలిపారు.
దేశంలో బీజేపీని ఒంటరి చేసేందుకు కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపించేందుకు సీపీఎం ముందుండి పనిచేస్తున్నదని చెప్పారు. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే ప్రభుత్వం ఎలా కూలిపోతుందో అమిత్షా చెప్పాలని డిమాండ్ చేశారు.