హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): భగత్సింగ్ గొప్ప దేశభక్తుడే కాకుం డా పరిణతి చెందిన కమ్యూనిస్టు అని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చనిపోవడమే త్యాగం కాదని, పాలకుల నిర్బంధం ఉన్నా ప్రజల కోసం పనిచేయడం విప్లవకారులకు పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. రెడ్ బుక్డే సందర్భంగా మంగళవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘భారత విప్లవ కెరటం భగత్సింగ్’ పుస్తక సామూహిక పఠన కార్యక్రమం జరిగింది.
దీనికి తమ్మినేని హాజరై మాట్లాడుతూ ప్రపంచ మానవాళి విముక్తి కోసం మార్క్స్-ఎంగెల్స్ రచించిన కమ్యూనిస్టు మ్యానిఫెస్టో గ్రంథాన్ని నిరుడు పఠనం చేయగా, ఇప్పుడు భగత్సింగ్ పుస్తకాన్ని పఠనం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యు డు సాగర్, పార్టీ నేతలు వెంకట్, నరసింహారావు, జ్యోతి, మల్లు లక్ష్మి పాల్గొన్నారు.