హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్ష నేతలను ప్రలోభాలకు గురిచేసి లొంగదీసుకోవడం.. లేదం టే ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థల పేరిట భయభ్రాంతులకు గురిచేయడం.. వినకుంటే అరెస్టు చేసి జైలులో పెడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు.
హైదరాబాద్ ఎంబీ భవన్లో ఆదివారం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాల ఎన్నికల క్యాంపెయిన్ను బీజేపీ బలహీనపరిచే కుట్రలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.